13 July, 2026 | 9:27 PM

Breaking News

విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •   ఆల్బెండజోల్ మాత్రాల పంపిణి   •   ఇబ్రహీంపేట్ లో వర్షాలు కురవాలని బసవేశ్వర ఆలయంలో జలాభిషేకం   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యువజన వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి   •   ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి   •  

భారత్‌లో మ్యాచ్‌లు ఆడే ప్రసక్తే లేదు: బీసీబీ

14-01-2026 01:13 AM

ముంబై: టీ20 ప్రపంచకప్- భారత్‌లో మ్యాచ్‌లు ఆడే విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తన పట్టు వీడటం లేదు. మంగళవారం ఐసీసీతో జరిగిన సమావేశంలోనూ టోర్నమెంట్ కోసం భారత్‌కు వెళ్లకూడదని తమ నిర్ణయాన్ని బీసీబీ స్పష్టం చేసింది. భద్రతా కారణాలను వల్ల తమ జట్టును భారత్‌కు పంపబోమని, తమ మ్యాచ్లను శ్రీలంక లేదా మరేదైనా ఇతర వేదికకు మార్చాలని మరోసారి బీసీబీ డిమాండ్ చేసింది. షెడ్యూల్ ఇప్పటికే ఖరారు కావగడంతో వేదికలను మార్చడం అసాధ్యమని, బీసీబీ తన వైఖరి పునఃపరిశీలించుకోవాలని ఐసీసీ సూచించింది. కానీ బంగ్లా క్రికెట్ బోర్డు మాత్రం ఆటగాళ్లు భద్రత తమకు ముఖ్యమని బీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది.