15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఇదో లొల్లి..!

25-12-2025 12:21 AM

కలెక్టర్ కు కాంగ్రెస్ నేతల పిర్యాదు

కరీంనగర్, డిసెంబర్24(విజయక్రాంతి): జిల్లాలో తరచూప్రోటోకాల్ వివాదం తెరమీదికి వస్తుండటంతో అధికారుల తీరుపై అధి కార పార్టీ నేతలు గుర్రుమంటున్నారు.కరింనగర్ సి ఎస్ ఐ చర్చిలో అధికారికంగా జరి గిన క్రిస్మస్ వేడుకలల్లోకవ్వంపల్లి సత్యనారాయణ ఫోటోను విస్మరించడం వివాదానికి దారితీసింది.ప్రోటోకాల్ పాటించకపోవడం దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమే అంటూజిల్లా గ్రంధాలయ చైర్మన్ సత్తు మల్లేష్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొ రివి అరుణ్ కుమార్ లు బుధవారంకలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. కరీంనగర్ సి.ఎస్.ఐ ప్రాంగణంలో క్రిస్మ స్ వేడుకలు ఘనంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నగర ప్రతినిధులను కలుపుకొని సంబంధిత అధికారులు కార్యక్రమా న్ని సమన్వయం చేసే ప్రయత్నం చేసారు కాని ఈ కార్యక్రమానికి సంబంధించి విడుదలైన ఫోటోలు మరియు సమాచారంలో మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి స త్యనారాయణ ఫోటోను వారి పాల్గొనడాన్ని పూర్తిగా విస్మరించారు.

ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు ఇటీవల జరిగిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మానకొండూర్ నియోజకవర్గం7వ వార్డు పరిది లో జరిగింది.కార్యక్రమం అంశాలు అధికారిక ఫోటోలు, సమాచారంలో కవ్వంపల్లి పేరును పొందుపరచలేదు. ఉన్నత విద్యావంతుడు, గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న, ఒక దళిత ప్రజాప్రతినిదిని విస్మరించడం వల్ల దళిత సంఘాల నుండి విమర్శలు వస్తున్నాయి. కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా సా మాజిక అంశాలను పరిగణలోకి తీసుకొని ఇలా వ్యవహరిస్తుందా అనే సందేహాలు ప్ర జల్లో వ్యక్తమవుతున్నాయి.

ప్రజాస్వామ్య వ్య వస్థలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులకు తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వడం అ త్యంత అవసరం అని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుం డా జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని, దీనికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో దళితుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవలసి వస్తుందని కాంగ్రెస్ ఎస్ సి సెల్ నేతలు హెచ్చరించారు.