22 April, 2026 | 7:23 PM

Breaking News

ఐలేని రెడ్డి సంఘం అధ్యక్షునిగా మల్లారెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు   •   గొర్రెల కాపరికి న్యాయం చేసిన పట్టణ సీఐ శివశంకర్   •   వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకే చలివేంద్రాల ఏర్పాటు   •   గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం   •   జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అర్హత సాధించిన బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు   •   అకాల వర్షం – అన్నదాత ఆగమాగం   •   ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు   •   కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: రవినాయక్   •  

ఖేడ్‌లో హిందూ సంఘాల నిరసన

25-12-2025 12:20 AM

నారాయణఖేడ్, డిసెంబర్ 24: నారాయణఖేడ్ పట్టణంలో బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై హత్యకాండను నిరసిస్తూ బజరంగ్దళ్ పరిషత్ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీని చేపట్టారు ఈ సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులకు భారతదేశంలో అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ప్రతి భారతీయుడు హిందువులపై జరుగుతున్న దాడులను హత్యలను ఖండించాలని అన్నారు.

ద్విపుదాస్ మున్షి నీ అత్యంత దారుణంగా హతమార్చడం ప్రపంచంలోని యావత్ హిందూ సమాజానికి సిగ్గుచేటని అన్నారు. దేశంలోనే నాయకులు సంఘాలు పార్టీలకతీతంగా ఇలాంటి క్రూరమైన చెల్లెలు ఖండించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఆపకపోతే బంగ్లాదేశ్ పై యుద్ధం ప్రకటించాలని వారు ప్రధానిని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో హిందూ సంఘా ల నాయకులు రజినీకాంత్, ప్రశాంత్, అశోక్ యాదవ్, సురేష్, సాయిరాం, సతీష్, ప్రవీణ్, రవికుమార్, సతీష్ యాదవ్, ఓం ప్రకాష్, పూసల విజయ్, భూస అశోక్, గౌలి సంతోష్, మాణిక్ , జగన్నాథ్, రాజు గౌడ్ పూసల అంబాదాస్, శ్రీనివాస్, రుద్రారం వీరప్ప, పాల్గొన్నారు.