17 April, 2026 | 3:11 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఖేడ్‌లో హిందూ సంఘాల నిరసన

25-12-2025 12:20 AM

నారాయణఖేడ్, డిసెంబర్ 24: నారాయణఖేడ్ పట్టణంలో బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై హత్యకాండను నిరసిస్తూ బజరంగ్దళ్ పరిషత్ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీని చేపట్టారు ఈ సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులకు భారతదేశంలో అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ప్రతి భారతీయుడు హిందువులపై జరుగుతున్న దాడులను హత్యలను ఖండించాలని అన్నారు.

ద్విపుదాస్ మున్షి నీ అత్యంత దారుణంగా హతమార్చడం ప్రపంచంలోని యావత్ హిందూ సమాజానికి సిగ్గుచేటని అన్నారు. దేశంలోనే నాయకులు సంఘాలు పార్టీలకతీతంగా ఇలాంటి క్రూరమైన చెల్లెలు ఖండించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఆపకపోతే బంగ్లాదేశ్ పై యుద్ధం ప్రకటించాలని వారు ప్రధానిని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో హిందూ సంఘా ల నాయకులు రజినీకాంత్, ప్రశాంత్, అశోక్ యాదవ్, సురేష్, సాయిరాం, సతీష్, ప్రవీణ్, రవికుమార్, సతీష్ యాదవ్, ఓం ప్రకాష్, పూసల విజయ్, భూస అశోక్, గౌలి సంతోష్, మాణిక్ , జగన్నాథ్, రాజు గౌడ్ పూసల అంబాదాస్, శ్రీనివాస్, రుద్రారం వీరప్ప, పాల్గొన్నారు.