17 April, 2026 | 10:26 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

సందేశాత్మకంగా వీడే మన వారసుడు

01-07-2025 12:00 AM

రమేశ్ ఉప్పు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించి, నిర్మించిన సినిమా ‘వీడే మన వారసుడు’. ఇందులో లావణ్యరెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లు. జూలై 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఒకప్పుడు మెసేజ్ సినిమాలు వచ్చేవి.. ఆ తరహా లో ఈ సినిమాను హిట్ చేయాలని కోరుకుంటు న్నా” అన్నారు.

రమేశ్ ఉప్పు మాట్లాడుతూ.. “ఇందులోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి. రైతుల కష్టాలను అర్థవంతంగా ఆవిష్కరించిన ఈ కుటుంబ కథాచిత్రాన్ని థియే టర్‌లో చూడాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నా” అన్నారు. “రమేశ్ ఉప్పు మంచి సినిమాను తెరకెక్కించారు. గ్రామీణ ప్రాంతంలో షూటింగ్ జరిగింది.

అక్కడి మనుషులు, వాతావరణం ఎంతో బాగుండేది. సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం మాకుంది” అని హీరోయిన్లు లావణ్యరెడ్డి, సర్వాణి మోహన్ చెప్పారు. హీరో కృష్ణసాయి, డైరెక్టర్లు వీఎన్ ఆదిత్య, సముద్ర, దర్శకనిర్మాత సాయి వెంకట్, పోలీసు ఆఫీసర్ రామావత్ తేజ, కాంగ్రెస్ నాయకుడు సురేందర్‌రెడ్డి, పలువురు నటీనటులు పాల్గొన్నారు.