14-08-2025 04:38:42 PM
కాగజ్ నగర్ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలో గురువారం కాగజ్ నగర్ పట్టణంలో తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది. సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు(MLA Dr. Palvai Harish Babu), జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, మాజీ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్ర చారి, జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, మండలం అధ్యక్షులు పుల్ల అశోక్, మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, భాజపా పట్టణ అధ్యక్షుడు శివ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.