13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్

03-01-2026 12:00 AM

మొయినాబాద్, జనవరి 2 (విజయ క్రాంతి): నూతన సంవత్సరం పురస్కరించుకొని శుక్రవారం నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధికార ప్రతినిధి, నక్కలపల్లి వాసి గౌరీ సతీష్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి మొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, మంచి ఆలోచనలతో జీవితాలను మార్చుకోవాలని ఆకాంక్షించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గ్రామాల అభివృద్ధినే ధ్యేయంగా తీసుకుని పని చేయాలని సూచించారు.  నక్కలపల్లి గ్రామస్తులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.