02-09-2025 12:00:00 AM
కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్
భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 1, (విజయ క్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 3వ తేదీన చంద్రుగొండ మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలను చేపట్టడం జరిగిందని కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
VM బంజర నుండి చంద్రుగొండ మీదుగా కొత్తగూడెం వైపు వచ్చే వాహనాలను కల్లూరు, తల్లాడ,ఏన్కూరు, జూలూరుపాడు మీదుగా కొత్తగూడెం తరలించేలా చర్యలు తీసుకున్నా మన్నారు. కొత్తగూడెం నుండి వి యం బంజర వైపు ప్రయాణించే వాహనదారులు జూలూరుపాడు,ఏన్కూరు,తల్లాడ ,కల్లూరు మీదుగా వి యం బంజర వైపు ప్రయాణించాల ని కోరారు.
ఇట్టి ట్రాఫిక్ డైవర్షన్ మూడవ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వాహనదారుల ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు,ఆటంకాలు తలెత్తకుండా,ట్రాఫిక్ లో చిక్కుకో కుండా పోలీసులు చేపట్టే ట్రాఫిక్ డైవర్షన్ ను గమనించి ప్రజలు సహకరించాలని డిఎస్పీ కోరారు.