28 June, 2026 | 3:48 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

తక్కువ ఖర్చులో నాణ్యమైన ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం

09-09-2025 09:33 PM

జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ 

అయిజ: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్లు నిర్మించగలిగేలా సలహాలు ఇచ్చి, పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్(District Collector B.M. Santosh) అధికారులను ఆదేశించారు. మంగళవారం గద్వాల జిల్లా అయిజ మున్సిపల్ పరిధిలోని వార్డ్ నం.6 లో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన లబ్ధిదారులు చేపట్టిన ఇండ్ల నిర్మాణాలను తనిఖీ చేశారు. ఇంటి నిర్మాణం, పనులలో నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లలో మొత్తం 12 ఇళ్లకు మంజూరు అయినట్టు అందులో 5 రూఫ్ లెవెల్, 7 బేస్మెంట్ లెవెల్ ఉన్నట్లు అధికారులు కలెక్టర్ కు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ లబ్ధిదారుల నుండి ఇళ్ల నిర్మాణానికి ఏమైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకొని, పనులను వేగంగా పూర్తి చేయాలని,దశలవారీగా డబ్బులు ఖాతాలో వెంటనే జమ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సైదులు,మున్సిపల్ మేనేజర్ అశోక్ రెడ్డి, హౌసింగ్ ఎ.ఈ వంశీ,వార్డ్ ఆఫీసర్ భరత్,తదితరులు పాల్గొన్నారు.