15 June, 2026 | 7:19 PM

Breaking News

అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •  

ఎన్‌హెచ్ 65పై ట్రాఫిక్ జాం

02-11-2025 12:21 AM

నల్లగొండ జిల్లా చిట్యాలలో చెరువును తలపిస్తున్న రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ 

నాలుగు రోజులుగా నిలిచిపోయిన వర్షపు నీరు 

హైదరాబాద్-విజయవాడ ప్రయాణికుల ఇబ్బందులు

చిట్యాల, నవంబర్ 1 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద మొంథా తుఫాన్ ప్రభావంతో జాతీయ రహదారిపై నీరు నిలవడంతో శనివారం భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. చిట్యాల పట్టణ కేంద్రంలో రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ వద్ద వర్షపు నీరు చేరుకొని నాలుగు రోజులుగా చెరువుని తలపిస్తున్నది. దీంతో జాతీయ రహదారి 65పై హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులు వాహనాల రద్దీతో  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నిత్యం రద్దీగా ఉండే హైవేపై నీటి నిల్వతో గుంతలు ఏర్పడి రైల్వే వంతెన కింద నుంచి వాహనాలు నెమ్మదిగా కలుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. శనివారం చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు ఐదు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. వర్షపు నీటిలో ఆటో ఇరుక్కుపోగా అక్కడే విధులు నిర్వహిస్తున్న మునుగోడు ఎస్సై ఇరుగు రవి, పోలీస్ సిబ్బంది ఆటోను తోసి బయటికి తీశారు. చిట్యాల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో వాహనాల రద్దీ మరింత పెరుగుతున్నది.