calender_icon.png 20 September, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొల్లారం రైల్వే స్టేషన్‌ సమీపంలో విషాదం

20-09-2025 03:31:43 PM

హైదరాబాద్‌: బొల్లారం రైల్వే స్టేషన్‌(Bolarum Railway Station) సమీపంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు యువకులను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను సేకరించి పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులు కార్ఖానా, మచ్చ బొల్లారం వాసులుగా పోలీసులు గుర్తించారు.