08-07-2025 12:50:26 AM
మహిళా పోలీస్ సిబ్బందికి స్కిల్స్ డెవలప్మెంట్
నిజామాబాద్ జూలై 7 (విజయ క్రాంతి): ప్రస్తుత సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై మరియు ధర్నా లు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమముల తోపాటు , వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మహిళా సిబ్బంది తగు శిక్షణను పొలిస్ శాఖ ఆధ్వర్యంలో సి పి పర్యవేక్షణలో ఇప్పించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సిపి. సాయి చైతన్య, వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో మహిళలు తెలుసుకోవలసిన నూతనమైన స్కిల్స్ మెలకువలు జాగ్రత్తలు మహిళలకు తమపై తమకు ఆత్మవిశ్వాసం పెంపొందించు కోవడానికి కావలసిన శిక్షణ గురించి క్షణ ఇవ్వనున్నారు. ప్రతి మహిళా సిబ్బంది తప్పకుండా డ్రైవింగ్ నేర్చుకోవడం స్విమ్మింగ్ నేర్చుకోవడం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణముగా అన్ని రకాల మెలకువలను నేర్చుకొని తర్ఫీదు పొందే విధంగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినట్టు సిపి తెలిపారు .
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ మహిళల నిరసన కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ప్రతి మహిళా సిబ్బంది ఏవిధంగా తమ విధులు నిర్వహించాలో మరియు ఏ విధంగా అట్టి మహిళలను తరలించాలో వీటి గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు / స్కిల్స్ / టెక్నీక్స్ కోసం , ప్రతి ఒక్కరికి ఈ శిక్షణ కాలంలో ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు.
ఈ శిక్షణను ప్రతి మహిళా సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ శిక్షణ వారం రోజులపాటు ఉంటుందని కొత్త రకాల పద్ధతులను తెలుసుకోవాలని తెలియజేశారు. ఈ శిక్షణను ప్రభుత్వ స్కూళ్లలో పి.ఈ.టిలు పిడి లుగా ఉన్నటువంటి రెజ్లింగ్ , జూడో లలో జాతీయ పతకాలు తీసుకున్నటువంటి టీచర్ల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (ఏ ఆర్ ) శ్రీ రామ చంద్రరావు , నిజామాబాద్ ఏసిపి శ్రీ రాజా వెంకట్ రెడ్డి , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీ సతీష్ , శ్రీ శేఖర్ బాబు, ప్రభుత్వ స్కూళ్లకు చెందిన సంతోషి రుద్రూర్ హై స్కూల్, అనిత గుండారం జెడ్పిహెచ్ఎస్ స్కూల్, రజని దేగం జడ్పిహెచ్ఎస్ స్కూల్ తదితరులు పాల్గొనడం జరిగింది.