08-07-2025 12:16:45 AM
-ఎమ్మెల్యే మందుల సామేల్ ఆధ్వర్యంలో కొత్త రూపు
-రూ.1,400 కోట్ల నిధులతో పనులు
-తొమ్మిదేళ్ల రేషన్ కార్డుల ఎదురుచూపులకు తెర
-14న తుంగతుర్తికి సీఎం రేవంత్ రెడ్డి రాక
-ముఖ్యమంత్రి చేతుల మీదుగా కార్డుల పంపిణీ
తుంగతుర్తి, జూలై 7 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేద ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఈనెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి కేంద్రంలో ప్రత్యేక సభా ప్రాంగణంలో పేదలకు పంపిణీ చేయనున్నారు.
దీనితో గడిచిన 9 సంవత్సరాలుగా వేచి ఉన్న పేద ప్రజలకు ఇక లబ్ధి చేకూరనున్నది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డ్ ధరలకు సన్న బియ్యం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టలేని పథకాన్ని, ముఖ్యమంత్రి ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.
జులై 14న స్థానిక తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు జన్మదినం రోజున, ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో, సమయం కేటాయించి, నూతన రేషన్ కార్డుల బృహత్కర పథకాన్ని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి మండలం మాలిపురం బహిరంగ సభలో శ్రీకారం చుట్టడం పేద ప్రజలకు వరం లాగా భావించవచ్చు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి సుమారు 52,000 వేల మెజార్టీతో, గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఈ ప్రాంతంలో అధిక మెజార్టీతో గెలుపొందిన వారు లేకపోవడం గమనార్హం.
వెనకబడ్డ తుంగతుర్తిని ..అభివృద్ధి చేయడం నా కర్తవ్యం..
గడిచిన 18 నెలల కాలంలో తుంగతుర్తి నియోజకవర్గానికి సుమారు 1400 కోట్ల నిధులతో ఎమ్మెల్యే మందుల సామేలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. దీనిలో ముఖ్యంగా మొదటి దశలో గెలవగానే తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో దళితుల వీధుల్లో ఇండ్ల నుండి వెళుతున్న ఐటెన్షన్ వైర్లను 30 సంవత్సరాలు ఏ ఎమ్మెల్యే చేయలేని పని ,పట్టుమని పది రోజుల్లోనే పూర్తిచేయడం అభివృద్ధికి నాంది పలికిందని తెలుపవచ్చు.
రైతుల ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రవేశపెట్టగా సుమారు నియోజకవర్గంలో 25,269 మంది రైతులకు లబ్ధి చేకూరినట్లు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. గడిచిన 30 సంవత్సరాల కాలంలో మెయిన్ రోడ్డు నుండి గురుకులాలకు వెళ్లే రహదారులు, మట్టితో ఉండి, వానాకాలంలో ఒక పక్క విద్యార్థులు మరొక పక్క సిబ్బంది ,కష్టాలను చూచి తక్షణమే 20 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నూతన సీసీ రోడ్డును ఏర్పాటు చేశారు.
తుంగతుర్తి మండల కేంద్రంలో సుమారు 45 కోట్ల నిధులతో ఏరియా దవాఖాన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తి అయితే తుంగతుర్తి నియోజకవర్గంలోని పేద ప్రజలకు కార్పొరేట్ దవాఖాన స్థాయిలో సకల సౌకర్యాలు ఉచిత పరీక్షలు ఆపరేషన్లు అందుబాటులోకి రానున్నాయి. తిరుమలగిరి మండల కేంద్రంలో 30 సంవత్సరాలుగా విద్యార్థులు ఎదురుచూస్తున్న ఇంటర్ విద్యార్థుల కోసం నూతనంగా జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసిన ఘనత ఎమ్మెల్యేకి దక్కింది.
సుమారు 13 కోట్లతో సంఘం బ్రిడ్జి, కోడూరు కొమ్మల మీదిగా నూతనకల్ వరకు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 12 కోట్లతో కేతిరెడ్డి బ్రిడ్జి కాలువ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తయితే సుమారు 100 ల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. తుంగతుర్తి నుంచి రావులపల్లి ఎక్స్ రోడ్డు వరకు నూతన రహదారి రోడ్డు వెడల్పు నిర్మాణ పనులు 13 కోట్లతో కొనసాగుతున్నాయి.
తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో పేద విద్యార్థుల ఉన్నత చదువు కోసం నియోజకవర్గం లో సకల సౌకర్యాలతో వసతి గృహం సుమారు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు కొనసాధనన్నాయి. నియోజకవర్గంలో ప్రతి గ్రామపంచాయతీ నూతన బిల్డింగ్ కోసం నిధులు వెచ్చించి ,నిర్మాణ పనులు కొనసాగుతూ, పూర్తయిన బిల్డింగులకు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో వందల కోట్లతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేశారు.
తిరుమల మండల కేంద్రంలో అండర్ పాస్ నిర్మాణం చేపడుతున్నారు. తిరుమలగిరి నుండి అడ్డ గూడూరు వరకు నూతన రహదారి నిర్మాణం లో భాగంగా నూతన బ్రిడ్జి పనులు అనంతరం వద్ద కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు పథకం కింద నియోజకవర్గంలో 3500 ల లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంటి నిర్మాణ పనులకు నిధులు కేటాయిస్తున్నారు.
రానున్న రోజుల్లో నియోజకవర్గంలో రుద్రమచర్లను రిజర్వాయర్ గా మార్చడం ద్వారా వేల ఎకరాలు రైతులకు సాగులోకి రానున్నాయి. ఉద్యోగ అవకాశాల కోసం పారిశ్రామిక కారిడార్ అడ్డగూడూరు మండలంలో సుమారు 200 ఎకరాల్లో ఏర్పాటు చేయడం కోసం ప్రతిపాదనలు జరిగాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సుమారు 18 నెలల కాలంలోనే అభివృద్ధి కొనసాగుతూ, నిరంతరం పేద ప్రజల అభివృద్ధి కోసం తపించే వ్యక్తి, నియోజకవర్గంలోని ప్రజలకు ఎమ్మెల్యేగా రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని పలువురు నాయకులు పేర్కొంటున్నారు.
తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి కేంద్రంలో ఈనెల 14న నూతన రేషన్ కార్డు పంపిణీ సభ కార్యక్రమానికి ముఖ్యమంత్రితోపాటు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖ అధికారులు పాల్గొనున్నారు కావున అట్టి సభ స్థలాన్ని సంబంధిత అధికారులు ,పోలీస్ శాఖ అధికారులతో మాట్లాడి పరిశీలించారు. కావున సభను విజయవంతం చేయుటకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు మేధావులు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేకంగా కోరుతున్నారు.