6 May, 2026 | 9:17 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

ట్రైబల్ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి

28-07-2025 11:45 PM

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..

ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం టౌన్ పరిధి గొల్లగూడెం ట్రైబల్ ఆశ్రమ పాఠశాల(Gollagudem Tribal Ashram School)లో విద్యార్థిని ప్రతిమ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఖమ్మంలో సోమవారం రాత్రి ధర్నాకు దిగారు. వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకొని, మృతి చెందిన ప్రతిమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.