1 July, 2026 | 11:15 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

అమర జవాన్ మురళి నాయక్ కు ఘన నివాళి

11-05-2025 10:08 PM

తొర్రూరు: దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల త్యాగాలు వృధా కావని టిడిపి తొర్రూరు మండల అధ్యక్షుడు భోగ భాస్కర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఆదివారం టిడిపి ఆధ్వర్యంలో దేశ సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించిన జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాకిస్తాన్ లోని ఉగ్రస్తావరాలపై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ లో తెలుగు బిడ్డ వీరమరణం పొందడం బాధాకరమన్నారు.

సైనికుల త్యాగాలను దేశ ప్రజలు మరువబోరని తెలిపారు. జవాన్ల త్యాగాల వల్లే దేశ ప్రజలు సుఖంగా నిద్రపోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి పెద్దవంగర, కొడకండ్ల మండల అధ్యక్షులు బైన బిక్షపతి, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, నాయకులు సముద్రాల సోమయ్య, ఆర్. వెంకటేశ్వర్లు,ఘనపురం ఐలయ్య, కడుదుల రామయ్య, గుగులోత్ రమేష్, బోలగాని చిత్తరంజన్, వేల్పుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.