24 June, 2026 | 2:22 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు అప్రెంటిస్ మేళా

12-05-2025 05:50 PM

ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్ దేవానంద్

మందమర్రి,(విజయక్రాంతి): పారిశ్రామిక శిక్షణను పూర్తి చేసుకున్న అభ్యర్థులు వృత్తి నైపుణ్యం పెంచుకొనేందుకు అప్రెంటిస్ మేళా దోహద పడుతుందని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ జి దేవానంద్ అన్నారు. పట్టణంలోని ఐటిఐలో సోమవారం నిర్వహించిన ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పారిశ్రామిక శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు వివిధ సంస్థల్లో అప్రెంటిస్ గా చేరడం ద్వారా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుందని తద్వారా ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో వారు ఎంచుకున్న వృత్తుల్లో రాణించ వచ్చన్నారు.

పారిశ్రామిక శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అప్రెంటిస్ మేళాను సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడాలని ఆయన కోరారు. కాగా పట్టణంలో నిర్వహించిన అప్రెంటిస్ మేళాలో షైనీదర్ ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్, ఆదర్శ ఆటోమొబైల్స్ కరీంనగర్, ఎమ్మెస్ శ్రీనివాసరావు కంపెనీల ప్రతినిధులు పాల్గొనగా ఆయా సంస్థలో 132 ఖాళీలు ఉండగా ఐటిఐ పూర్తి చేసుకున్న 63 మంది అభ్యర్థులు మేలాకు హాజరయ్యారు. వీరిలో  37 మంది ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు, ఐటిఐ ఇన్స్ ట్రక్టర్లు, శిక్షణ పొందిన  అభ్యర్థులు పాల్గొన్నారు.