calender_icon.png 20 August, 2025 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

22న త్రైపాక్షిక భేటీ!

18-08-2025 02:05:48 AM

  1. ట్రంప్, పుతిన్, జెలెన్‌స్కీ సమావేశంకానున్నట్టు సమాచారం
  2. నేడు ఓవల్ హౌస్‌లో ట్రంప్-జెలెన్‌స్కీ భేటీ

న్యూఢిల్లీ, ఆగస్టు 17: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ముగ్గురూ ఈ నెల 22న భేటీ కానున్నట్టు సమాచారం. ఆగస్టు 22న త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేయాలని ట్రంప్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ అవనున్నారు.

వీరి సమావేశం తర్వాత ఈ విషయం గురించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జెలెన్‌స్కీతో పాటు ఫిన్‌లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, మరింత మంది నేతలు ట్రంప్‌తో భేటీ అవుతారని సమాచారం. ఈ త్రైపాక్షిక సమావేశం ఎక్కడ అనే వివరాలు తెలియదు.