6 July, 2026 | 3:12 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

ట్రాక్టర్ నడిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్

05-09-2025 01:53 PM

మహాశక్తి ఆలయంలో గణేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి సంజయ్..

కరీంనగర్ లో ప్రారంభమైన గణేశ్ నిమజ్జనం..

కరీంనగర్ (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) ట్రాక్టర్ నడిపారు. కరీంనగర్ లో శుక్రవారం గణేశ్ నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మహాశక్తి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి బండి సంజయ్ స్వయంగా గణేశ్ విగ్రహాన్ని ట్రాక్టర్ లో ప్రతిష్టించారు. ఆ వెంటనే బండి సంజయ్ ట్రాక్టర్ ఎక్కి కొద్ది దూరం డ్రైవింగ్ చేశారు. మరోవైపు కరీంనగర్ లో ఘనంగా గణేశ్ నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది.