calender_icon.png 7 September, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్ నడిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్

05-09-2025 01:53:56 PM

మహాశక్తి ఆలయంలో గణేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి సంజయ్..

కరీంనగర్ లో ప్రారంభమైన గణేశ్ నిమజ్జనం..

కరీంనగర్ (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) ట్రాక్టర్ నడిపారు. కరీంనగర్ లో శుక్రవారం గణేశ్ నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మహాశక్తి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి బండి సంజయ్ స్వయంగా గణేశ్ విగ్రహాన్ని ట్రాక్టర్ లో ప్రతిష్టించారు. ఆ వెంటనే బండి సంజయ్ ట్రాక్టర్ ఎక్కి కొద్ది దూరం డ్రైవింగ్ చేశారు. మరోవైపు కరీంనగర్ లో ఘనంగా గణేశ్ నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది.