17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

26-11-2025 11:02 PM

సిద్దిపేట: కొమురవెల్లి మండలంలోని గురువన్నపేట గ్రామంలో మియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. మియా ఫౌండేషన్ ఎండీ అర్షద్ అలీ ఆధ్వర్యంలో ఆర్వీఎం ఆస్పత్రి వైద్యులు సేవలు అందించారు. ఈ శిబిరంలో కీళ్ల నొప్పులు, గుండె, కిడ్నీ, కాలేయం, బీపీ, షుగర్‌ వంటి పలు రకాల వ్యాధులకు వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. దాదాపు 300 మంది వైద్యసేవలు పొందారని అర్షద్ అలీ తెలిపారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.