16 April, 2026 | 9:06 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి లేఖ

15-05-2025 02:14 PM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) లేఖ రాశారు. ఫీజురీఎంబర్స్ మెంట్ బకాయిలపై అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ఏమైంది అని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.8 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలలు(Private colleges) దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడ్డాయని సూచించారు. ఫీజులు చెల్లించినదే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఫీజురీఎంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని బండి సంజయ్( Bandi Sanjay Kumar) డిమాండ్ చేశారు.