16 April, 2026 | 9:00 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి

15-05-2025 01:57 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొనాలని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం(Kesamudram mandal) కాట్రపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీల వద్దకు ఏఐసీటియు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న వెళ్లి కోరారు. కార్మికులు కొట్లాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా చేసిందని, దీని ద్వారా పెట్టుబడిదారి, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండడానికె ఈ విధంగా చేయడం జరిగిందని, ఇది కార్మికులకు ఎంతో నష్టదాయకమని ఆయన అన్నారు. వాటిని రద్దు చేయాలని అదేవిధంగా అసంఘటితరంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడం, సమగ్ర చట్టం  చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాటగాని శ్రీనివాస్, కాలేపాక వంశీ, జల్లే జాన్సన్, యాటగాని రాములు, గడ్డం నరసయ్య, పానుగంటి రాములు,  శ్రీనివాస్, చాగంటి రాములు,కలపాక శ్రీను, మునుగోడు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.