15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నగరంలో నేడు యూనిటీ మార్చ్

18-11-2025 12:00 AM

నిజామాబాద్, నవంబర్ 17 :(విజయ క్రాంతి): సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ నగరంలో ఈ నెల 18న (మంగళవారం) యూనిటీ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని ఎన్.వై.కే సమన్వయకర్త శైలి బెల్లాల్ తెలిపారు. ఉదయం 9.00 గంటలకు జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ చౌక్ నుండి పాదయాత్ర ప్రారంభం అవుతుందని అన్నారు. ఈ పాదయాత్ర శివాజీ చౌక్, ఫులాంగ్ చౌరస్తా, కోర్టు సర్కిల్ మీదుగా పాత కలెక్టరేట్ మైదానం వరకు కొనసాగుతుందని వివరించారు.

యూనిటీ మార్చ్ (పాదయాత్ర)లో పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తోపాటు పలువురు ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. యూనిటీ మార్చ్‌లో భాగస్వాములై దేశ ఐక్యతను చాటాలని కోరారు.