02-09-2025 12:00:00 AM
యాచారం సెప్టెంబర్ 1: మండల పరిధిలోని మాల్ గ్రామంలో సోమవారం నాడు ఉత్తరప్రదేశ్ చెందిన ప్రజాప్రతినిధులు అధికారుల బృందం సభ్యులు పర్యటించారు.గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.
పల్లె ప్రకృతి వనం, నర్సరీ, అంగడి సంతను సందర్శించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో రాధా రాణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని. గ్రామపంచాయతీ రికార్డులు ఇంటి పన్నుల వసూలు,శానిటేజషన్ స్ట్రీట్ లైట్ లు సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పలు అంశాలపై అధికారులతో చర్చించి అవగతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ హెడ్ సిడిపిఏ స్మిత, ఎంపీఓ శ్రీలత పంచాయతీ సెక్రటరీ ఎర్ర రాజు పాల్గొన్నారు.