20-10-2025 12:00:00 AM
అలంపూర్ ,అక్టోబర్ 19 : గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ పట్టణంలోని తొమ్మిదవ వార్డుకు చెందిన గొల్ల లక్ష్మీదేవి బీపీ పూర్తి స్థాయిలో తగ్గి అనారోగ్యంతో నిస్సహాయ స్థితిలో చేరుకుంది.వెంటనే గమనించిన బిఆర్ఎస్ నాయకులు వడ్డేపల్లి సూరి 108 అంబులెన్స్ కు సమాచారం అందించి మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసు పత్రికి పంపించి మానవత్వం చాటు కున్నా రు. సకాలంలో వైద్య పరీక్షలు నిమిత్తం ఆసుపత్రికి తరలించడంతో పలువురు అభినం దించారు. సాటి మనిషి పట్ల మానవతా దృక్పథంతో మెలగాలని ఆయన అన్నారు.