13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

వైభవ్ సూర్యవంశీ మెరుపులు

06-01-2026 12:00 AM
  1. రెండో యూత్ వన్డేలోనూ గెలుపు

భారత్ యువ జట్టుదే వన్డే సిరీస్

బెనోనీ , జనవరి 5 : ప్రపంచకప్‌కు ముం దు భారత్ అండర్ 19 జట్టు దుమ్మురేపుతోంది. సౌతాఫ్రికా టూర్‌లో యూత్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. వరుసగా రెండో వన్డేలోనూ సఫారీ అండర్ 19 జట్టు ను చిత్తుగా ఓడించింది. కిషన్ కుమార్ సింగ్ బౌలింగ్(4/46)కు తోడు వైభవ్ సూర్యవంశీ మెరుపులతో ఘనవిజయం సాధిం చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది.

96 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో జాసన్ రోవెల్స్ సెంచరీతో ఆదుకున్నాడు. భారత బౌలర్లలో కిషన్ కుమార్ సింగ్ 4 , అంబరీష్ 2, కనిష్క్ చౌ హాన్, దీపేశ్ దేవేంద్రన్, కిలాన్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు, ఛేజింగ్‌లో భారత్ అండర్ 19 జట్టుకు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 6.1 ఓవర్లలోనే 67 పరుగులు జోడిం చారు. ఆరోన్ జార్జ్(20) ఔటైనా..వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు.

సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. భారీ షాట్ల తో రెచ్చిపోయిన వైభవ్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరింత దూకుడుగా ఆడే ప్రయత్నంలో వైభవ్ 24 బంతుల్లోనే 68 (1 ఫోర్, 10 సిక్స ర్లు) పరుగులకు వెనుదిరిగాడు. ఈ చిచ్చరి పిడుగు ఇన్నింగ్స్‌లో 64 పరుగులు బౌండరీలు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి.

తర్వాత వే దాంత్ త్రివేది 31 (4 ఫోర్లు), అభిగ్యాన్ కుందు 48 (3 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయాన్ని పూర్తి చేశారు. వర్షం కారణంగా మధ్యలో గంటసేపు మ్యాచ్ నిలిచిపోగా.. భారత్ లక్ష్యాన్ని 27 ఓవర్లలో 174 రన్స్‌కు కుదించారు. భారత్ యువ జట్టు 23.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. సిరీస్‌లో చివరి మ్యాచ్ బుధవారం  జరుగుతుంది.