17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

16-12-2025 12:24 AM

కాంగ్రెస్ కండువా కప్పుకొన్న సంకాపురం పెద్ద తాండ్రపాడు సర్పంచులు 

అలంపూర్, డిసెంబర్ 15: గ్రామాల్లో అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అందుకే సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. సోమవారం శాంతినగర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయిజ మండలం లోని సంకాపురం గ్రామ సర్పంచ్ రాజు జాగిర్ధర్ , అలాగే రాజోలి మండలంలోని పెద్ద తాండ్రపాడు సర్పంచ్ సుబ్బారెడ్డి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా నూతనంగా గెలుపొందిన సర్పంచులకు కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు.  రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి, ఐజ సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు, ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ ,ఆలయ మాజీ ధర్మకర్త  విశ్వనాధ రెడ్డి ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.