14 July, 2026 | 6:45 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

పూరిల్లు దగ్ధం

22-01-2026 12:33 AM

ములకలపల్లి, డిసెంబర్ 21 (విజయక్రాంతి): విద్యుదాఘాతానికి గురై బుధవారం మండలంలోని కొత్త గంగారం గ్రామంలో ఓ పూరిళ్ళు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షల రూపాయల మేరకు ఆస్తి నష్టం జరిగింది. కొత్త గంగారం గ్రామానికి చెందిన సుంకిపాక శివ కుమార్, ఆరుద్ర దంపతుల తాటాకుల ఇంట్లో కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగి ఇల్లు మొత్తం ఖాళీ బుగ్గి అయ్యింది. ఇంట్లోని గృహో పకరణాలు, నిత్యవసరాలు, దుస్తులు కాలి బూడిద అయ్యాయి.

ఈ దంపతులకు సెంట్ భూమిలేదు. ప్రతి రోజు కూలీ పని చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఇంట్లో ఉన్న బియ్యం, బట్టలు, వంట సామాగ్రి, పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లు, మంచాలు, వంట గిన్నెలు మొత్తం కాలిపోయాయి. కట్టుబట్టలతో మిగిలారు. ఈ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబంతో పాటు గ్రామస్తులు కోరారు.