17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బస్తీల అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నాం

02-11-2025 12:00 AM

సీసీ రోడ్డు పనులు పరిశీలించిన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్

కాప్రా, నవంబర్ 1(విజయక్రాంతి) : చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఎస్సీ బస్తీలో జరుగుతున్న 280 మీటర్ల సీసీ రోడ్ పనులను జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి బస్తీ అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు.

స్థానిక ప్రజల సౌకర్యార్థం సీసీ రోడ్ పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి.ఈ బాలకృష్ణ, ఏ.ఈ అభిషేక్, ప్రశాంత్, ప్రవీణ్ గౌడ్తో పాటు స్థానిక నాయకులు డి.లక్ష్మయ్య, ఎం.లక్ష్మయ్య, కె.నర్సింహా, కొమ్ము సురేష్, జి.భాను చందర్, జి.గణేష్ గౌడ్, టి.సురేష్, పి.శ్రీనివాస్, మంచాల అనిత, కొమ్ము ఇందిర, పందిగారి కిష్టమ్మ తదితరులు పాల్గొన్నారు.