10 April, 2026 | 8:35 PM

Breaking News

ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ప్రత్యేక వైద్య శిబిరం   •   అందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి   •   నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షుడిని సన్మానం   •   గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్   •   చిన్నారికి ఆర్థిక సాయం అందజేసిన పిఎసిఎస్ మాజీ చైర్మన్ జాలే నరసింహారెడ్డి   •   శివంగాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ   •   బనిగండ్లపాడులో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన బండారు   •   నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం   •   నూతన తహసిల్దార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు   •   విద్యుత్ శాఖ కాంపౌండ్ లో అగ్నిప్రమాదం   •  

ఆ కండీషన్‌పై టికెట్ ధరలు పెంచుతామని చెప్పాం

13-01-2026 01:30 AM

సినిమా టికెట్ ధరలు, బెనిఫిట్ షోలకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని, టికెట్ ధరల పెంపు జీవోల విషయం తనకు తెలియదని ఇటీవల సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న సంగతి తెలిసిందే. సోమవారం సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై మంత్రి మరోసారి స్పందించారు. టికెట్ ధరల పెంపు విషయంలో అంతా కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. “సంధ్య థియేటర్ ఘటన తర్వాత టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని నేను, ముఖ్యమంత్రి ప్రకటించిన మాట వాస్తవమే.

ఆ తర్వాత మేమంతా కూర్చొని మాట్లాడుకుని మా నిర్ణయాన్ని సవరించాం. ఒకవేళ టికెట్ ధరలు పెంచాల్సి వస్తే 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలని షరతు పెట్టాం. అందుకు అనుగుణంగానే కొన్ని సినిమాలకు ఇచ్చాం. దీనిపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ సమయంలో నేను హైదరాబాద్‌లో లేను. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా నల్గొండ, భువనగిరి జిల్లాలను పర్యవేక్షిస్తున్నా. అప్పుడే జీవో ఇచ్చారు. మా సీఎం ఏ శాఖల విషయంలోనూ జోక్యం చేసుకోరు. అందరినీ కలుపుకొని వెళ్తారు” అని చెప్పారు.