11 April, 2026 | 5:51 PM

Breaking News

సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిభాపూలే   •   అక్షరాయుధంతో అణచివేతపై పోరాడిన ధీశాలి పూలే   •   జెక్ కాలనీలో చలివేంద్రం ప్రారంభం   •   తల్లి జ్ఞాపకార్థం మున్సిపల్ కార్మికులకు టిఫిన్ బాక్సులు అందజేత   •   CAA అమలు వేగవంతం— చొరబాటుదారులు సామాన్లు సర్దుకోవాల్సిందే! మోదీ హెచ్చరిక   •   విద్యా విప్లవానికి నాంది..   •   సామాజిక సమస్యలపై కార్మిక వర్గం పోరాడాలి   •   యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలి   •   సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్పు విజయ రమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం   •   ఇరాన్‌ కండిషన్స్‌కు ఒప్పుకున్న అమెరికా   •  

కుట్రదారులను శిక్షిస్తాం!

12-11-2025 12:42 AM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటన వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరిని వదలిపెట్టబోమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన దారుణ సంఘటన అందరినీ తీవ్రం గా కలచివేసింది అని పేర్కొన్నారు. భూటాన్‌లోని థింఫులోని చాంగ్లిమెథాంగ్ గ్రౌండ్ లో మంగళవారం జరిగిన భారీ సభలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

భూటాన్‌లో రెండు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ థింఫునకు చేరుకున్నారు, అక్కడ ఆయన గ్లోబల్ పీస్ ప్రార్థన ఉత్సవం, ఇతర అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో జరిగిన ఘోరమైన కారు పేలుడు ఘటన తనను ఎంతో కలచివేసిందని, తాను ఎంతో బాధపడుతూ భూటాన్‌కు చేరుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

బాధిత కుటుంబాలకు ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. మరియు ఈ దుఃఖ సమయంలో యావత్ దేశం వారికి తోడుగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. పేలు డు దర్యాప్తులో పాల్గొన్న అన్ని సంస్థలతో తాను రాత్రంతా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని అన్నారు.

భారత అధికారులు దాడి వెనుక ఉన్న పూర్తి కుట్రను వెలికితీసి, నిందితులను చట్టం ముందు నిలబెట్టేలా చూస్తారని ఆయన ఉద్ఘాటించారు. దీని వెనుక ఉన్న కుట్రదారులను వదిలిపెట్టబోం. ఘటనకు కారకులైన వారందిరీపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు.