08-05-2025 01:43:53 AM
కేంద్ర క్యాబినెట్ సమవేశంలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, మే 7: ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తామని, భద్రతా పరమైన అంశాలపై భారత ప్రభుత్వం ఎప్పటికీ రాజీ పడదని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. న్యూఢిల్లీలో బుధవారం నిర్వహించిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాద స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసిన భారత సైన్యానికి మోదీ అభినందనలు తెలిపారు. సైన్యం పన్నిన పథకం వందకు వందశాతం అమలైందని కొనియాడారు.