14 July, 2026 | 4:37 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

ఏజెన్సీ ప్రాంతాలకు అండగా ఉంటాం

05-10-2025 12:57 AM
  1. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ 
  2. మూడు మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లో 120 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ

చర్ల, అక్టోబర్ 4 (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు చర్ల మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన బట్టిగూడెం, బత్తినపల్లి, రామచంద్రాపురం గ్రామాలను శనివారం సందర్శించారు.  సీఆర్పీఎఫ్ 141బీఎన్ కంపెనీ కమాండర్ సెబాస్టియన్, చర్ల సీఐ రాజు వర్మ , ఇతర పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి గ్రామాల్లోని 120 కుటుంబాలను సందర్శించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ఈ మూడు గ్రామాల ప్రజలకు నెజిల్ కంపెనీ వారి సహకారంతో నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. ఎస్పీ సారథ్యంలో ఏజెన్సీ ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు విద్య, వైద్యం, రవాణా వంటి కనీస సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.