15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వానికి లేఖ రాశాం

18-10-2025 12:25 AM

హైకోర్టుకు తెలిపిన ఎన్నికల సంఘం

పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిం చేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ సురేందర్ అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఎ న్నికల సంఘాన్ని గత విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కో ర్టుకు తెలిపారు.

అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది విద్యాసాగర్ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల వి డుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలుపుదల చేసినట్లు రాష్ట్ర ఎన్ని కల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ప్రభుత్వం రిజర్వేషన్లను మరోసారి ఖరారు చేయాల్సి ఉందన్నారు. ఈ మే రకు ప్రభుత్వానికి లేఖ కూడా రాశామన్నా రు. దీనిపై సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని వివరించారు. ప్ర భుత్వం నిర్ణయం చెప్పడానికి 3 వారాల స మయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే కౌంటర్ దా ఖలుకు ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు రెండు వారాల గడువు ఇచ్చిం ది. తదుపరి విచారణను వాయిదా వేసింది.