22 July, 2026 | 2:12 PM

Breaking News

కొత్త రేషన్ కార్డులతో పేదలకు సంక్షేమం

02-08-2025 05:26 PM

ఏఎంసీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్..

మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదేశాల మేరకు శనివారం మద్నూర్ మండలం మొఘ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నూతన రేషన్ కార్డులను లబ్దిదారులకు మద్నూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్(AMC Vice Chairman Paramesh Patel) ఆధ్వర్యంలో పంపిణీ చేశరు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత పదేళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, మాజీ ఎంపీటీసీ హన్మంత్ పటేల్, సంగ్రామ్ పటేల్, మల్లు గొండ, రవి కిరణ్, సాయి పటేల్, గంగాధర్ లబ్ధిదారులు గ్రామస్తులు పాల్గొన్నారు.