02-08-2025 06:59:52 PM
చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోరిమి ఓంకారం..
చండూరు (విజయక్రాంతి): సుశీలమ్మ ఫౌండేషన్(Susheelamma Foundation) ఆధ్వర్యంలో చండూరు మండల పరిధిలోని బంగారిగడ్డ గ్రామంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొరిమి ఓంకారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 50 సంవత్సరాలు పైబడిన వారిని కంటి పరీక్ష నిర్వహించి అదే రోజు బస్సులో తీసుకుపోయి ఆపరేషన్ చేయిస్తారని, ప్రజలు సకాలంలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీ మేడం హాజరవుతున్నారని వారు తెలిపారు. కంటి పరీక్షలకు వచ్చె వారందరికీ భోజన సదుపాయం ఉంటుందని ఆయన అన్నారు.