29 July, 2026 | 9:56 PM

Breaking News

బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •   సిఐ నీలం రవికి ఘన సన్మానం   •   మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •  

వర్షం ఆగిన వెంటనే తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి..

29-10-2025 12:30 PM

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య

తుంగతుర్తి, (విజయక్రాంతి): మొంథా తుఫాన్ వల్ల కురుస్తున్న అకాల వర్షాలకు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం కుప్పలు సరియైన పట్టాలు ప్రభుత్వం సప్లై చేయకపోవడం వలన తడిసి ముద్దయినా పరిస్థితి లో రైతాంగం బాధ పడుతావున్నారు. బండారామారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ప్రభుత్వం వర్షాలు ఎలిసిన మరుసటి రోజునుండే కాంటాలు ప్రారంభించి తేమశాతం తో సంభందం లేకుండా కొనుగోలు చేయాలి. మద్దతు ధర చెల్లించాలీ. ఆరుగాలం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఆర్థికంగా అప్పులపాలై. సరియైన విధంగా సకాలంలో ప్రభుత్వం ఎరువులు అందించక నాన తంటాలు పడి పండించిన పంట తెచ్చి కొనుగోలు కేంద్రాల్లో పోస్తే 20రోజులు దాటినా ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించక పోవడం. అకాల తుఫాన్ వర్షాలు రావడంతో రైతు బేంబేలు ఎత్తి దిక్కు తోచని స్థితిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా వర్షాలు ఆగిన వెంటనే కాంటాలు మొదలయ్యే విధంగా అధికారులకు ఆదేశాలివ్వాలని కోరుతున్నాం. అలాగే తేమశాతం తో సంభందం లేకుండ మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమావేశం లో బిఆర్ఎస్ నాయకులు అకారపు భాస్కర్. కొల్లూరి మహేందర్. పాల్గొన్నారు.