calender_icon.png 5 May, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు కోరుకున్నది జరిగి తీరుతుంది

05-05-2025 01:59:06 AM

  1. మోదీ పట్టుదల మీకు తెలుసు
  2. పహల్గాం దాడికి గట్టిగా బదులిస్తాం
  3. సంస్కృతి జాగరణ్ మహోత్సవ్‌లో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ, మే 4: ‘నేను హమీనిస్తున్నా.. మోదీ నాయకత్వంలో మీరు కోరకున్నది కచ్చితంగా జరుగుతుంది’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన సంస్కృతి జాగరణ్ మహోత్సవ్ కార్యక్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ‘దేశంపై దాడి చేసేందుకు ధైర్యం చేసిన వారికి తగిన సమాధానం ఇవ్వడం నా బాధ్యత.

మోదీ పనితనం గురించి మీకు తెలుసు. దేశ భద్రత కోసం అవసరమైన చర్యలను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మన దేశ భౌతిక స్వరూపాన్ని సైనికులు కాపాడుతుంటే, రుషులు, జ్ఞానులు దేశ ఆధ్యాత్మిక రూపాన్ని పరిరక్షిస్తున్నారు.’ అని అన్నారు.