15 April, 2026 | 12:55 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మధ్యాహ్నమైతే వైద్యులుండటంలేదు?

04-01-2026 12:21 AM
  1. నాలుగు తర్వాత టీచర్లు ఉండరు
  2. పిల్లలకు పీఈటీలు ఆటలెలా ఆడిస్తారు?
  3. మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): ప్రభుత్వాస్పత్రుల్లో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత డాక్టర్లు ఉండంటం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నిమ్స్ ఆస్పత్రిపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై మంత్రి దామోదర రాజన ర్సింహ సమాధానం ఇవ్వడానికి ముందు చైర్మన్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైనా వైద్యం అందించాలంటే జిల్లా అస్పత్రులను అభివృద్ధి చేయాలన్నారు. ఆ విధంగా చేస్తే నిమ్స్‌పై ఒత్తిడి తగ్గుతుందని మంత్రికి సూచించారు.

ఉద్యోగాలు పొందే వైద్యులు కచ్చితంగా ఒక ఏడా ది గ్రామీణ ప్రాం తాల్లో పనిచేయాలని, ప్రభుత్వా స్పత్రుల్లో పనిచేసే వారికి ప్రోత్సహకాలను ప్రభుత్వం అందించాలని సూచించారు. వేలాది ప్రభుత్వ స్కూళ్లలో లైబ్రేరియన్లు లేరని, ఆటలు ఆడించేందుకు పీఈటీలు లేరని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోసు శ్రవణ్ ప్రస్తావించిన అంశంపై చైర్మన్ స్పందిస్తూ.. సాయంత్రం నాలుగు దాటితే బడుల్లో టీచర్లు ఉండట్లేదని, ఇక పీఈటీలు పిల్లలకు ఆటలెలా ఆడిస్తారని ప్రశ్నించారు. ప్రతి ఉద్యోగి బాధ్యతగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు మంచి ఫలితాలు వస్తాయన్నా రు. అలాగే కంటి వెలుగు మంచి కార్యక్రమమని, దాన్ని గ్రామాల్లో అమలు చేయాలని మంత్రిని కోరారు.