15 April, 2026 | 12:19 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సుంకరి సాయిలు

06-01-2026 06:12 PM

విజయక్రాంతి,పాపన్నపేట: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పాపన్నపేట గ్రామానికి చెందిన సుంకరి సాయిలు ఎన్నికయ్యారు. శంషాబాద్ లో గత మూడు రోజులుగా ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఇట్టి మహాసభల్లో టేక్మాల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న సుంకరి సాయిలును రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు.

ఈయన విద్యార్థి దశలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, మెదక్ జిల్లా ప్రముఖ్ గా సేవలందిచ్చారు. తమపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించినందుకు జాతీయ, రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా, మండల నాయకులు సుంకరి సాయిలు ఎన్నికకు  హర్షం వ్యక్తం చేశారు.