calender_icon.png 26 July, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భర్త మందలించాడని మనస్థాపంతో భార్య ఆత్మహత్య

25-07-2025 08:12:28 AM

  1. సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నావని భర్త మందలింపు.
  2. క్షణక్షణం ఆవేశంలో ప్రాణాలు కోల్పోతున్నారు.
  3.  ముక్కు పచ్చరాలని పసిపిల్లలు అనాధలుగా మారుతున్నారు.
  4. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో విషాద ఘటన.

హుజూర్ నగర్ (చింతలపాలెం): సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నావని భర్త మందలించటంతో మనస్థాపానికి గురై భార్య ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District) చింతలపాలెం మండలంలోని జువారి సిమెంట్ ఫ్యాక్టరీ కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. చింతలపాలెం ఎస్ఐ సందీప్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...మహబూబాబాద్ జిల్లా రాజులపేటకు చెందిన కాశిబోయిన శ్రీనాథ్ జువారి సిమెంట్ పరిశ్రమ పాఠశాలలో మ్యాథ్స్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

భార్య మౌనిక (30),కుమారుడు,కుమార్తెతో కలిసి జువారిపరిశమ్రలోని కార్వర్డ్స్ నివాసం ఉంటున్నారు.గత రెండు రోజులు క్రితం మధ్యాహ్నం ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీనాథ్ భోజనానికి ఇంటికి వచ్చారు.ఆ సమయంలో మౌనిక తమను పట్టించుకో కుండా సెల్ ఫోన్ మాట్లాడడం తో అది గమనించి ఇటీవల ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతున్నావని శ్రీనాథ్ మందలించాడు.ఈలోపు పిల్లలు ఇంటికి వచ్చి చూడగా తల్లి మౌనిక సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించింది. తండ్రికి సమాచారమిచ్చి ఆసుపత్రికి తీసుకు వెళ్లగా అప్పటికే మౌనిక మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ రెడ్డి విలేకరులకు తెలిపారు.