11 April, 2026 | 3:12 PM

Breaking News

20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •   నిర్మల్‌లో నిరసన తెలుపుతున్న నాయకులు   •   అతిధి అధ్యాపకుల సర్వీసును 2026-27 విద్యా సంవత్సరానికి కొనసాగించాలి   •   ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కరించండి   •   పేదల అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం   •   ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

నెట్‌బాల్ పోటీల్లో కాంస్యం కైవసం

24-01-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 23(విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల , కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సీఈసీ చదువుతున్న విద్యార్థిని బొట్టుపల్లి సాయి దీక్ష పేదరికం తన ప్రతిభకు అడ్డుకాదని నిరూపించింది. సీనియర్ జాతీయ నెట్బాల్ పోటీల్లో (జీడీ గోల్ డిఫెండర్) విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జాతీయస్థాయిలో కాంస్య పతకం సాధించింది. ఈ నెల 11 నుంచి 14 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 43వ సీనియర్ నేషనల్ నెట్బాల్ అసోసియేషన్ చాంపియన్షిప్లో ఘనత సాధించింది.