calender_icon.png 25 August, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణకు శంకుస్థాపన

24-08-2025 10:38:09 PM

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ ప్రధాన రహదారి నిర్మాణంతో శ్రీకారం చుట్టామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రూ.6 కోట్ల 50 లక్షలతో 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించగా, ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్  హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. వేములవాడ పట్టణ వాసులు, రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల భక్తులు, ప్రజలు 54 ఏండ్లుగా ఎదురు చూస్తున్న వేములవాడ మూలవాగు నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం దాకా రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. 80 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తామని ఇచ్చిన హామీ నేడు అమలులోకి తీసుకు వచ్చామని వెల్లడించారు.