15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

18-12-2025 01:32 AM

కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం 

కల్వకుర్తి టౌన్ డిసెంబర్ 17 : ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం అన్నారు. బుధవారం లయన్స్ క్లబ్ కల్వకుర్తి, ఆమనగల్లు, జిల్లా అందత్వ నివారణ సంస్థ రామ్ రెడ్డి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో పట్టణంలోని డిప్యూటీ డిఎంహెచ్వో కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు.

సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాత్ర ఎంతో గొప్పదన్నారు.  కంటి తోపాటు అనేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా మందులు అందజేసి, అవసరం ఉన్నవారికి కంటి శాస్త్ర చికిత్సలు కూడా నిర్వహిస్తుందన్నారు.

వైద్య శిబిరంలో 64 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అందులో 16 మందికి కంటి శస్త్ర చికిత్సలు అవసరమని రామ్ రెడ్డి కంటి ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు బావండ్ల వెంకటేష్, లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు  శ్రీధర్, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ కిషన్, మాజీ కోశాధికారి శ్రీనివాసు, ప్రచార కార్యదర్శి గణేష్, నాయకులు శ్రీనివాసు, మధు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.