13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఉత్తమ సమాజ నిర్మాణానికి యువత కృషి చేయాలి

13-01-2026 02:28 AM

బోయిన్‌పల్లి వివేకానంద ఉచిత ట్యూషన్ సెంటర్‌లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు 

సికింద్రాబాద్, జనవరి ౧౨ (విజయ క్రాంతి): వివేకానంద జయంతి రోజున నిర్వహించుకునే జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా బోయిన్‌పల్లి వివేకానంద ఉచిత ట్యూషన్ సెంటర్‌లో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలలో స్వామి వివేకానంద చిత్రపటానికి పుష్పగుచ్చా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రామిరెడ్డి, ప్రస న్న, మల్లేశం, శంకరాచార్య, పోలా బాబురావు, త్రికోణ కేశవరావు, పవన్, జోనా ఆ, నిర్మల సుధా, వజ్రంగ్ నాయుడు ముఖ్య అతిథులుగా  హాజరయ్యారు.

అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు స్వామి వివేకానంద జీవిత చరిత్ర గురించి తెలియజేస్తూ, స్వామి వివేకానంద ఆదర్శాలను అలవర్చుకుని, సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతూ ఉత్తమ సమాజ నిర్మాణానికి యువత కృషి చేయాలని పిలుపు నిచ్చారు. వివేకానంద ఉచిత ట్యూషన్ సెంటర్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద ఉన్నత ఆలోచనలను కేవలం స్మరిం చడమే కాకుండా,వాటిని మన దైనందిన జీవితాల్లో ఆచరణలో పెట్టినప్పుడే వారికి మనం అర్పించే నిజమైన నివాళి అవుతుందని కే.కేశవరావు తెలిపారు. ఈ సందర్భంగా వివేకానంద జయంతి సందర్భంగా విద్యార్థిని,విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు.