సలార్‌లో సీజ్ అయిందా

24-04-2024 12:15:00 AM

‘సలార్ 2’ సినిమా చిత్రీకరణకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే ప్రభాస్ సహా ఇతర తారాగణం ఖాన్సార్‌లో కాలు పెట్టనున్నారు. ‘సలార్  శౌర్యంగ పర్వం‘ పేరిట ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం సినీ వర్గాల్లో చక్కెర్లు కొడుతోంది. అదే ‘సలార్ 2’లో మరో హీరోయిన్ కనపడనుండటం. మొదటి భాగమైన ‘సలార్ హ్ సీజ్ ది ఫైర్’లో శృతి హాసన్ కథానాయికగా నటించగా, రెండో భాగంలో మరో నాయికను జోడించనున్నారట దర్శకుడు. ఆ పాత్రలో కియారా అడ్వానీ కనపడటం దాదాపు ఖాయమని సమాచారం.

‘భరత్ అను నేను’ చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన కియారా తర్వాత వరుస బాలీవుడ్ చిత్రాలతో బిజీగా గడుపుతుంది. హృతిక్ కాంబినేషన్‌లో రానున్న ‘వార్ 2’లో నటించే అవకాశాన్ని అందుకున్న కియారా, ‘సలార్2’లో సీజ్ అయిందా లేదా అన్నదానిపై చిత్ర బృందం స్పందించాల్సి వుంది. కాగా శంకర్ చరణ్ కలయికలో రానున్న ‘గేమ్ చేంజర్’ ద్వారా మరో మారు తెలుగు ప్రేక్షకులను అలరించనుంది ఈ సోయగాల తార.. కియార.