03-09-2025 01:40:17 AM
యూరియా కొరత తీరుస్తున్నాం:మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రాష్ర్టంలో యూరియా కొరత అంశం పెద్దగా చేసి, రైతులను ప్రభుత్వం పైకి రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. రాష్ర్టంలో రైతులకు యూరియా కొరత ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ, యూరి యా సరఫరా చేయాల్సిన కేంద్రం, రాష్ట్రానికి కేటాయింపుల్లో కోత విధించడం వల్ల ఇబ్బంది కలిగిందని అన్నారు.,ముఖ్యమం త్రి, శాఖ మంత్రి ఇప్పటికే కేంద్రంతో అనేక దఫాలుగా మాట్లాడారని, రాష్ట్రానికి యూరి యా దిగుమతి జరుగుతోందని,
మహబూబాబాద్ జిల్లాకు 1,800 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు తెలిపారు. రాష్ర్ట అటవీ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుంటేనే రాష్ర్టం అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా పయనిస్తుందని, అందుకోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని వైద్యశాఖ బలోపేతానికి కృషి చేస్తా మన్నారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని కోరారు.
ముఖ్యమం త్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా గిరిజన ప్రాంతం కాబట్టి అధిక నిధులు కేటాయించి జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, ఎంపీ పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, జిల్లా అభివృద్ధికి మరింత చేయూతని అందించాలని వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ, అటవీ దేవదాయ శాఖ మంత్రులను కోరారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వుతై కుమార్ సింగ్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె. అనిల్ కుమార్, డిఎంఈ డాక్టర్ కె. నరేంద్ర కుమార్, ఎన్ఎంసి రాష్ర్ట కోఆర్డినేటర్ డాక్టర్ విమల తమస్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లకావత్ వెంకట్, ప్రభుత్వ హాస్పిటల్ సూపరెంటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.