calender_icon.png 25 December, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప ఆలయానికి రూ.1.18 లక్షల విరాళం

25-12-2025 02:40:11 AM

ఎల్లారెడ్డి, డిసెంబర్ 24 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీశ్రీశ్రీశ్రీ అయ్యప్ప ఆలయంలోని పడి మెట్టు కోసం 1,18,000/-ల విరాళాన్ని బిజెపి నాయకుడు అయ్యప్ప భక్తుడైన సాయిరాం గౌడ్ ప్రదేశం.

గతంలో నిర్వహించిన మహా పడిపూజలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఈ విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా బిజెపి నేత సాయిరాం గౌడ్ లక్ష 18 వేల రూపాయల చెక్కును ఆలయ కమిటీ అధ్యక్షుడు పద్మ శ్రీకాంత్ కు అందించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి చంద్రం స్వామి, ఆలయ పూజారి శ్రీనివాస స్వామి, నగేష్ గురు స్వామి, మాజీ వైస్ ఎంపీపీ నువ్వుగొండ శ్రీనివాస్, యాదగిరి స్వామి, సంతు స్వామి తదితరులు పాల్గొన్నారు.