31 May, 2026 | 7:15 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

25-12-2025 02:39 AM

ఎస్‌వీఎం సెంట్రల్ పబ్లిక్ పాఠశాలలో నిర్వహణ

ఖమ్మ, డిసెంబర్ 24(విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని శ్రీనివాస్ నగర్‌లో గల ఎస్వీఎం సెంట్రల్ పబ్లిక్ పాఠశాలలో బుధవారం  సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థు లు శాంటా క్లాజ్ వేషధారణలో ఆకట్టుకోగా, ఒకరికొకరు కేక్‌లు పంచుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హ్యాపీ క్రిస్మ స్ నినాదాలతో స్కూల్ ప్రాంగణం మారుమోగింది. పాఠశాల డైరెక్టర్ కొండా శ్రీధర్ రావు మాట్లాడుతూ ఏసుక్రీస్తు చూపిన ప్రే మ మార్గం సర్వకాలం ఆచరణీయమైనదని, నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి సిద్ధపడిన జీసస్ గొప్పతనం నుంచి ప్రతి ఒక్క రూ స్ఫూర్తి పొందాలని అన్నారు.

డైరెక్టర్ ఉమ మాట్లాడుతూ మీ చుట్టూ ఉన్న నిరుపేదలకు మరియు అవసరంలో ఉన్నవారికి మీకు తోచిన సహాయం చేయాలని, ఇతరుల పట్ల కోపాన్ని వీడి ప్రేమతో మెలగడం నేర్చుకోవాలని అన్నారు. మరో డైరెక్టర్ సురేష్ బా బు మాట్లాడుతూ వెలుగునిచ్చే నక్షత్రంలా మీ జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుకోవాలని, కష్టపడి చదవాలని విద్యార్థులకు సూ చించారు.  కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ప్రసాద్, టీచర్లు పాల్గొన్నారు.