17 June, 2026 | 11:00 AM

Breaking News

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •   హామీలు నెరవేర్చకుంటే తిరుగుబాటు తప్పదు   •  

కులాంతర వివాహాలకు రక్షణ చట్టం తేవాలి

19-11-2025 12:57 AM

వనస్థలిపురంలో సీపీఎం నాయకుల ఆందోళన

ఎల్బీనగర్, నవంబర్ 18 : కులాంతర, మతాంతర వివాహాలకు రక్షణ కల్పించడానికి తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని సీపీఎం నాయకుడు ఆలేటి ఎల్లయ్య డిమాం డ్ చేశారు.  రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరుక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు ఎర్ర చంద్రశేఖర్ ప్రేమ వివాహం చేసుకున్నాడని అతని సోదరుడు ఎర్ర రాజశేఖర్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన వధువు తండ్రి కావలి వెంకటేష్ పాత్రధారులు సూత్రధారులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

వనస్థలిపురం రైతు బజార్ దగ్గర  మంగళవారం సీపీఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా  చెల్లించాలని,  కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  సీపీఎం నాయకులు భూష రాజు కాశయ్య,  మన్యం రాధమ్మ. అభిమాన గంగమ్మ, భారతమ్మ, వరలక్ష్మి, జయమ్మ, లక్ష్మణ్ నాయక్  తదితరులు పాల్గొన్నారు.