12 March, 2026 | 10:03 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

ఎరువుల దుకాణంలో ధరల సూచిక ఏర్పాటు చేయాలి

18-11-2025 08:13 PM

విత్తనాలు అధిక ధరలకు అమ్మవద్దు..

ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసిన ఎల్లారెడ్డి ఎడీఎ..

గాంధారి (విజయక్రాంతి): ఎరువుల దుకాణాలలో ధరల సూచికాలు ఏర్పాటు చేయాలని ఎల్లారెడ్డి ఎడీఎ సుధ మాధురి అన్నారు. మంగళవారం గాంధారి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి రాజలింగంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ దుకాణాలలో నిల్వ ఉన్నటువంటి ఎరువుల వివరలను అడిగి తెలుసుకున్నారు. విత్తనాల, నిల్వల రిజిస్టార్ లను తనఖీ చేసారు. ఈ సందర్బంగా ఎడిఏ సుధ మాధురి మాట్లాడుతూ మండలంలోని రైతులకు విత్తనాలు అధిక ధరలకు అమ్మవద్దని అన్నారు. విత్తనాలు, ఎరువులు కొరత సృష్టించకుండా సకాలంలో రైతులకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజలింగం, ఫర్టిలైజం దుకాణాల యజమానులు పాల్గొన్నారు.