22 June, 2026 | 2:04 PM

Breaking News

డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •  

తండ్రీకొడుకుల చుట్టూ తిరిగే కథ

19-09-2025 12:51 AM

మలయాళ స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా రూపొందు తున్న చిత్రం ‘వృషభ’. రచయిత, దర్శకుడు నంద కిషోర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతోంది. శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సీకే పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మాతలు. ఇందులో రాగిణి ద్వివేది, సమర్జిత్ లంకేశ్ ముఖ్యపాత్రల్లో నటించారు.

ఈ మూవీ టీమ్ తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, వీఎఫ్‌ఎక్స్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. టీజర్ విడుదల సందర్భంగా దర్శకుడు నంద కిషోర్ మాట్లాడుతూ.. “వృషభ’ కేవలం ఓ సినిమా కాదు. మాకు ఇది ఓ మర్చిపోలేని ఎమోషన్. తండ్రీకొడుకుల చుట్టూ తిరిగే శక్తిమంతమైన కథ ఇది’ అని తెలిపారు.

“వృషభ’ మా అందరికీ ఎంతో నచ్చిన, ఇన్‌స్పైర్ చేసిన ప్రాజెక్ట్. దీన్ని భావోద్వేగాలు, అనుబంధాలు, ప్రతీకారం, స్వేచ్ఛ కోసం చేసే పోరాటం వంటి అంశాలతో తెరకెక్కించాం” అని నిర్మాత ఏక్తా కపూర్ పేర్కొన్నారు. మలయాళం, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించబడిన ఈ సినిమా హిందీ, కన్నడ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.